మరికొన్ని విశేషాలు

                                  మరికొన్ని విశేషాలు


  నానాపురాణసారోద్దరమైన గంగా సహస్రనామ వాళలో గంగను--- `అద్రిరాజసుతా,ఈశ్వరవల్లభా,ఖండేందుధారిణి,గౌరీ గిరి సుతా,గిరిశాప్రియా,ప్రణవాక్షారరూపిణి,పార్వతి,వైష్ట్నవి,మహాదేవర్దధారిణి,వైశ్వనరి,శరజన్మప్రసు,శితికంఠ మహాప్రియా,స్త్రీ సౌభాగ్యదాయిని-- అంటూ స్తుతించారు. ఈ నామలన్ని గంగా దేవి శివుని అర్ధాంగిగా,గౌరీ దేవిగా,విష్ణు సోదరిగా,కుమారా జననిగా,స్త్రీ లకు మంగళ సౌభాగ్యదాయినిగా పరాశక్తిగామూర్తి గొన్న విషయాన్ని నిరూపిస్తున్నాయి..కాగా గంగమ్మ వేంకటేశ్వరుని చెల్లలు అనడానికి సహేతుకమైన ఆధారాలు ఉన్నాయి

  గ్రామంలోని అందరు అన్నోన్యమైత్రి బావంతో ఆరాధించడానికి వీలుగా గ్రామ దేవతా పూజ ఏర్పడింది
సాధారణంగా ఈ పూజ విధానం అనైదికంగానే వుంటుంది. ఎవరికీ నచ్చిన రీతిలో వారు పూజించవచ్చు.ఒకప్పుడు గ్రామస్తులే స్వయంగా పూజించేవారు,తర్వాత క్రమంగా మందిరాలు, ఆలయాలు ఏర్పడినాయి. ఇప్పుడు ప్రతేయ్ఖంగా పూజారులు వచ్చారు. మునుపు వేప చెట్టు క్రిందనో,కొండ క్రిందనో,ఎతైన ఒక పెద్ద బండనో,రాయినో వుంచి,దాన్నే గ్రామ దేవతగా బావించేవారు.తర్వాత విగ్రహాలు వచ్చాయి. ఇప్పటికి చాలా గ్రామంలో గుడిగోపురాలు లేకుండా,విగ్రహాలు లేకుండా,పెద్ద బండలే గ్రామ దేవతలుగా పూజలు అందుకొంటున్న సంగతి మనం గమనించవచ్చు

           గ్రామ సంరక్షణకు,మశూచి మొదలగు వ్యాధుల నివారణకు,దుస్ట శక్తులను రానివ్వకుండా,జంతువులను వింత వ్యాధులనుండి సంరక్షించుటకు,వర్షాలు వచ్చి భూములు పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండడానికి,పంటలకు తెగుళ్ళు రాకుండా ఉండుటకు- ఇలా అనేక శుభ ఫలితాలకై గ్రామ దేవతలను పూజించుట ఆచారంగా ఏర్పడింది. గంగమ్మ విగ్రహానికి 108 కుండల నీటితో అభిషేకం చేసిన చోట్ల సత్ఫలితం చేకూరింది కుడా!

     అన్ని చోట్లా వున్న గంగమ్మకు,తిరుపతిలో ఎంతో వైభవంగా జాతర జరుపుకుంటున్న గంగమ్మకు చాలా ప్రతయ్యఖతలు,విశిష్టతలు ఉన్నాయి. ఇక్కడి గంగమ్మకు చాలా చారిత్రక నేపధ్యం ఉంది. ఇక్కడి ఇద్దరు గంగమ్మలు మహా మహిమ గల వారె.తాళ్ళపాక గంగమ్మను పెద్ద గంగమ్మగా అని ,తాతయ్య గుంట గంగమ్మను చిన్న గంగమ్మగా అని పిలుస్తుంటారు

  తాళ్ళపాక గంగమ్మ గుడి తాళ్ళపాక చెరువు గట్టు (తిరుపతి)ఫై వుంది. ఈ చేరువునే- నేడు ఆర్.టి.సి. బస్ స్టేషన్ అయింది.తాతయ్య గుంట గంగమ్మ గుడి `తుడా` ఆఫీసుకు ముందు వైపున ఉంది.(ఇప్పుడు).(మల్లయ్య గుంట కట్టకు మధ్యలో తాతయ్యా గుంట గంగమ్మ గుడి వుంది.విశేషంగా మ్రోకుబాళ్ళు తాతయ్య గుంట గంగమ్మకే సమర్పిస్తుంటారు

ఈ ఇద్దరు గంగమ్మల చరిత్ర ,ఇక్కడికి ఎలా వచ్చిందో సంగ్రహంగా చూద్దాం
 పూర్వం తిరుమలఫై శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక వైష్ణవ భక్తుణ్ణి ``తాతా! తాతా 1 అని పిలిచేవారట! అందువల్ల ఆ భక్తుని పేరు తాతచార్యులుగా రూపొందింది.

క్రి.శ.16 వ శతాబ్దంలో తాతచార్యుల వంశస్తులకు కైంకర్యం కోసం లబించిన చెరువుకు `తాతయ్య గుంట` అనే పేరు వచ్చింది.తాతాచార్యులచే చెరువు(గుంట) గట్టున ప్రతిష్టించిన గంగమ్మ కనుక `తాతయ్య గుంట గంగమ్మ అనే పేరు వచ్చింది

 పూర్వం తిరుమలకు యాత్ర చేసే భక్తులు మొదట ఈ గ్రామ దేవతను పూజించి ,పిదప తిరుమలకు బయలుదేరేవారని పెద్దలు అంటారు. గంగమ్మ శ్రీ వారి చెల్లలని అందుకే తిరుమల తిరుపతి దేవస్థానంవారు నుండి(సారే) చిర,రవిక,పసుపు,కుంకుమ,గాజులు,మున్నగు, మంగళ ద్రవ్యాలు, జాతరకు ముందురోజు గంగమ్మకు పంపడం ఆనవాయితీగా వస్తున్నా ఆచారం.

అది పరాశక్తి అయిన గంగమ్మ తిరుపతికి దక్షిణంవైపున రెండు కి.మీ దూరంలో వున్న అవిలాల గ్రామంలో పుట్టిందని అంటారు.ఇప్పటికి అవిలాల గ్రామం నుంచి పసుపు కుంకుమలు రానివే గంగమ్మ జాతర చేయరు. కనుక ఆ గ్రామం నుండి విధిగా అమ్మవారికీ మంగళ ద్రవ్యాలు వస్తాయి

   ప్రసిద్ద వైష్ణవచారుడైన తాతాచార్యులు అన్నమాచార్యుల స్వగ్రామమైన తాళ్ళపాక నుండి గంగమ్మను తెచ్చి,తిరుపతిలో నిలిపినందున తాళ్ళపాక అయిoదని ప్రతీతి